23, సెప్టెంబర్ 2010, గురువారం

ఎలా పిలిచినా సత్యమొక్కటే



ప్రాచీన కాలంలో మంత్రద్రష్టలైన ఋషులు
మునులు ఆ పరమేశ్వరుని
ఇంద్రుడు, యముడు, వాయుదేవుడనే పదాలతో
సూచించారు
వేదాంతులు ఆ మాటలతో వర్ణించలేమని
బ్రహ్మ అనే శబ్ధంతో సూచించారు

శైవులు శివుడని, వైష్ణవులు విష్ణువని,
బౌద్ధులు బుద్దుడని, జైనులు అర్హన్ అని,
సిక్కులు సత్ శ్రీ అకాల అని
పరమేశ్వరుని స్తుతిస్తారు 

జగదీశ్వరుడైన ప్రభువును
కొందరు శక్తియని, కొందరు స్వామియని
కొందరు తల్లియని, కొందరు తండ్రియని
మరికొందరు కుమారస్వామియని
భక్తితో ప్రార్థిస్తారు

ఎవరెన్ని విధములుగా పిలిచినా
ఆ పరమేశ్వరుడు ఒక్కడే
అద్వితీయుడతడు. వేరెవరూ సాటి లేరు

కామెంట్‌లు లేవు: